![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక క్రిస్మస్ రాబోతున్న సందర్భంగా ఆ ఈటీవీలో ఆ సెలెబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు శ్రీదేవి డ్రామా కంపెనీ కంపెనీ. ఈ ఈవెంట్ కి కొత్త పెళ్ళికొడుకు మానస్ నాగులపల్లి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోకి రష్మీ శాంతాక్లాజ్ లా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది. ఇక స్టేజి మీదకు వచ్చిన రాంప్రసాద్ మానస్ కి "హ్యాపీ మారీడ్ లైఫ్" అంటూ విష్ చేసి "ఏంటో ఎదవలందరికీ పెళ్ళిళ్ళయిపోతాయి ముందే" అని కౌంటర్ వేసేసరికి "అందుకే నీకు ముందు అయ్యింది పెళ్లి" అని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు మానస్. దానికి రాంప్రసాద్ పరువు పోయింది.
తర్వాత శ్రీ సత్యతో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మానస్ మంచి హాట్ గా డాన్స్ చేసాడు.. అతని డాన్స్ చూసిన జడ్జి ఇంద్రజ " యు ఆర్ ఏ హీరో మెటీరియల్ మ్యాన్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక గుంటూరు కారం మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ని ధనుంజయ్ పాడి అందరినీ అలరించాడు. ధనుంజయ్ వాయిస్ ని ఇంద్రధనుస్సుతో పోల్చింది ఇంద్రజ. తర్వాత నాటీ నరేష్ దశావతారం మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గా చేసి చూపించి మంచి ఫన్ క్రియేట్ చేసాడు. "బట్టలు, చెప్పులు నాకు ఏనాడైనా కొంటివా...రాంప్రసాద్ అని పలికిన నోటా ఇంద్రజమ్మ అని పలకనులే" అంటూ ఆ సాంగ్ ని పేరడీ చేసి మరీ పాడాడు నరేష్. లాస్ట్ లో భావన, ఐశ్వర్య కలిసి రెయిన్ డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఐతే ఈ క్రిస్మస్ ఎపిసోడ్ లో మాత్రం హైపర్ ఆది కనిపించలేదు, అలాగే వర్ష కూడా కనిపించలేదు. ఇక రష్మీ వేసుకొచ్చిన డ్రెస్ బాగుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ, వర్షా, ఆది ఎందుకు రాలేదంటూ ఆరా తీస్తున్నారు.
![]() |
![]() |